హైదరాబాద్‌లో ప్రారంభమైన నాగార్జున కొత్త సినిమా

16 Feb, 2021 20:55 IST|Sakshi

టాలీవుడ్ ‘కింగ్‌’  నాగార్జున అక్కినేని తాజా చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘గరుడవేగ’ మూవీతో హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాదులో ఇవాళ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీకి ఆయన క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. కాగా ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, శరత్ మరార్‌కు చెందిన ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఇక త్వరలోనే ఇతర తారాగణాన్ని కూడా చిత్రయూనిట్‌ ప్రకటించనుంది.

కాగా షూటింగ్స్‌ తిరిగి పున: ప్రారంభం కావడంలో నాగార్జున తన చిత్రాల స్పీడును పెంచినట్లు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్‌ ప్రారంభించిన అయిన చిత్రాలు ‘వైల్డ్ డాగ్’, బాలీవుడ్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’  షూటింగ్‌లను ఇటీవల ఆయన పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ మూవీతో నాగార్జునను వినూత్నంగా చూపించేందుకు ప్రవీణ్ సత్తారు చాలా హోంవర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి కావడంతో ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకోచ్చే పనిలో పడ్డట్లు మూవీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు