Nagarjuna: 'నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా'..

27 Oct, 2021 12:24 IST|Sakshi

Nagarjuna: నాగార్జున, టబు హీరో, హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలై పాతికేళ్లు దాటింది. ఈ సందర్భంగా నాగార్జున  ఈ సినిమా విశేషాలను షేర్‌ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఎక్కువగా బైక్‌ సీన్స్‌ ఉన్నాయి.

అయితే అవన్నీ డూప్‌ లేకుండానే చేశానని నాగార్జున తెలిపారు. అంత వేగంతో ఎలా నడిపానో తెలియదు. ఇప్పుడైతే చేయను. ఇప్పుడు మా పిల్లలు అడిగినా కూడా అలా చేయవద్దనే వాళ్లకి చెబుతాను అని పేర్కొన్నారు. ఆ సీన్స్‌లో గంటకి 80-90 మీటర్ల వేగంతో బైక్‌ నడిపామని, ఒకరు పడ్డా అందరూ పడేవాళ్లని పేర్కొన్నారు. అప్పుడు ఎలాగో చేశాను కానీ అలాంటి రిస్కీ థింగ్స్‌ చేయొద్దనే సలహా ఇస్తానని సినిమా విశేషాలను పంచుకున్నారు. కాగా ప్రస్తుతం నాగార్జున నటించిన ఘోస్ట్‌ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. 

మరిన్ని వార్తలు