Namrata Shirodkar: 'సర్కారు వారి పాట'ను వీక్షించిన నమ్రతా శిరోద్కర్.. ఫుల్‌ జోష్‌లో ఫ్యాన్స్‌

14 May, 2022 18:45 IST|Sakshi

Namrata Shirodkar Watches Sarkaru Vaari Paata Movie: సూపర్‌ స్టార్ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మే 12న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ల రాబడుతుడుతూ దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలైనప్పటినుంచే మహేశ్ బాబు అభిమానులతో థియేటర్‌ హాల్‌లు కిక్కిరిసిపోయాయి. తాజాగా ఈ మూవీని మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ వీక్షించారు. 

'సర్కారు వారి పాట' సినిమాను తిలకించేందుకు నమ్రతా శిరోద్కర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సుదర్శన్‌ 35 ఎంఎం థియేటర్‌కు వెళ్లారు. ఈ థియోటర్‌ అభిమానులతో సందడిగా మారింది. అధికజనంతో కిక్కిరిసిపోయింది. వారందరి మధ్య ఒక ప్రేక్షకురాలిగా నమ్రత సినిమాను వీక్షించారు. ఇదిలా ఉంటే ఫుల్‌ క్రౌడ్‌ ఉన్న ఆ థియేటర్లలో సందెట్లో సడేమియాలా జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఓ వ్యక్తి జేబులో నుంచి పర్సు కొట్టేశారు. అందులో రూ. 2800 నగదు ఉన్నట్లు సమాచారం. తర్వాత అక్కడ కొద్దిసేపు పలువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

చదవండి: గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌ పార్టీ.. ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు