Veera Siha Reddy: బాలయ్య మూవీ క్రేజీ అప్‌డేట్.. ఫస్ట్‌ సింగిల్ ఆరోజే.. !

23 Nov, 2022 18:43 IST|Sakshi

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజా క్రేజీ అప్‌ డేట్ వచ్చేసింది. 

(చదవండి: యాక్షన్‌ మోడ్‌లో బాలయ్య.. ‘వీరసింహారెడ్డి’లో ఇదే కీలక సన్నివేశం)


ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ పాటను ఈనె 25న ఉదయ 10.29 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. దీంతో బాలయ్య మాస్ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. 

మరిన్ని వార్తలు