Asian Tarakarama Theatre: బాలకృష్ణ ముఖ్య అతిథిగా తారకరామ థియేటర్‌ పున:ప్రారంభోత్సవం

11 Dec, 2022 16:53 IST|Sakshi

హైదరాబాద్‌లోని కాచిగూడ తారకరామ థియేటర్‌ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్‌ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్‌ తారకరామ పేరుతో డిసెంబర్‌ 14న ఈ థియేటర్‌ గ్రాండ్‌గా రీఓపెన్‌ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్‌ పున:ప్రారంభించనున్నారు.

కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్‌ కె దాస్‌ నారంగ్‌ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్‌ దాస్‌ తనయుడు సునీల్‌ నారంగ్‌ కొత్త టెక్నాలజీతో థియేటర్‌ను రెనొవేట్‌ చేయించారు.  4కే ప్రొజెక్షన్‌, సుపీరియర్‌ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు.

975 సీటింగ్‌ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్‌, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్‌ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్‌ నారంగ. భరత్‌ నారంగ్‌, సురేశ్‌ బాబు సదానంద గౌడ్‌లు ధన్యవాదాలు తెలిపారు. 

చదవండి: 
అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్‌
పెళ్లి తర్వాత హీరోయిన్స్‌ కెరీర్‌ ముగిసినట్టేనా? యామీ గౌతమ్‌ ఏమన్నదంటే..

మరిన్ని వార్తలు