ఈ ఏడాది ‘వీ’ సినిమాతో అందరిని అలరించిన నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాత కలకత్తా బ్యాక్డ్రాప్లో సాగే శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. టాక్సీవాలాతో గుర్తింపు తేచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా.. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అవుతుండగానే మరో సినిమాను పట్టాలెక్కించేదుకు సిద్ధం అయ్యాడు నాని. కరోనా లాక్డౌన్ సమయాన్ని కుటుంబంతో సరదాగా గడిపిన నాని తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నాని తన కొత్త సినిమాను ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఓ సినిమా చేయనున్నాడు. ఇది నానికి తన కెరీర్లో 28వ సినిమా. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. చదవండి: డైరెక్టర్ అవుదాం అనుకుని యాక్టర్
నానికి జోడిగా కేరళ భామ నజ్రియా నజీమ్ నటించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు తమిళ్, మలయాళంలోనే నటించిన నజ్రియాకు డైరెక్టు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఈ సినిమా టైటిల్ను, మిగతా పూర్తి సమాచారాన్నిదీపావళి తరువాత నవంబర్ 21న వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని బీఏ రాజు తన ట్విటర్ అకౌంట్లో షేర్చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ను విడుదల చేశారు. ‘నవంబర్ 21న కలుద్దాం.. ఆ లోపు దీపావళి శుభాకాంక్షలు. అన్నట్లు తెలుగు కుటుంబానికి నజ్రియా ఫర్హద్కు స్వాగతం’ అని పేర్కొన్నారు. చదవండి: నానికి విలన్గా యంగ్ హీరో
అంటే.. అదన్నమాట..
November 21న #CurtainRaiser తో కలుద్దాం మరి..
ఆలోగా.. HAPPY DIWALI 💥
అన్నట్టు.. Nazriya Fahadh Welcome to మన తెలుగు Film Family 🎉@NameisNani #NazriyaFahadh #VivekAthreya #Nani28 pic.twitter.com/3QGuP7BpYL
— BARaju (@baraju_SuperHit) November 13, 2020