మళ్లీ జంటగా కనిపిస్తారా? 

19 Aug, 2020 02:33 IST|Sakshi

నాని, అదితీ రావ్‌ హైదరీ ‘వి’ సినిమాలో కలసి నటించారు. తాజాగా మరోసారి జోడీ కట్టనున్నట్టు సమాచారం. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృతియాన్‌ దర్శకత్వంలో నాని ఓ సినిమా కమిట్‌ అయిన సంగతి తెలిసందే. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ టైటిల్‌ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ నిర్మించనుంది. ఇందులో నానీకి జోడీగా సాయి పల్లవి నటించనున్నారు. అలానే ఈ సినిమాలో మరో హీరోయిన్‌ కూడా ఉన్నారని తెలిసింది. ఆ పాత్రకు  అదితీ రావ్‌ హైదరీని తీసుకున్నట్టు సమాచారం. దీంతో రెండోసారి నాని, అదితీని జంటగా చూడొచ్చన్నమాట. ‘ఎంసీఏ’ తర్వాత ఈ సినిమా కోసం సాయి పల్లవి, నాని  కూడా మళ్లీ కలసి  నటించనున్నారు. ముందుగా ఈ సినిమాను ఆగస్టులో ప్రారంభించి, డిసెంబర్‌ నెలలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా వల్ల ప్లాన్‌ మొత్తం మారింది. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు.  

మరిన్ని వార్తలు