-

Shyam Singha Roy Movie: ఓటీటీకి శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ!, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

30 Dec, 2021 19:10 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా.. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన మూవీ హిట్‌టాక్ తెచ్చుకుంది. అంతేగాక కమర్షియల్‌గా మంచి కలెక్షన్స్‌ రాబడుతోంది.

చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్‌, షణ్నూతో బ్రేకప్‌ తప్పదా?

కాగా గతంలో నాని నటించిన ‘వీ, టక్‌’ జగదీశ్‌లో నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ఈ మూవీపై ఆయన ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు. నాని ఆశించినట్టుగానే శ్యామ్‌ సింగరాయ్‌ థియేటర్లో విడుదలై మంచి హిట్‌టాక్‌ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు శ్యామ్‌ సింగరాయ్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్యామ్‌ సింగరాయ్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందని, అయినా థియేటర్లోనే విడుదల చేసేందుకు..

చదవండి: వైరల్‌ అవుతున్న యాంకర్‌ ప్రదీప్‌ ట్వీట్‌, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు

మేకర్స్‌ ఆసక్తి చూపినట్లు నాని ఇప్పటికే శ్యామ్‌ సింగరాయ్‌ ఈవెంట్‌లో చెప్పకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా థియేటర్లో రిలీజ్‌ అయిన ఈమూవీని భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. వచ్చే ఏడాది 2022 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్‌ సింగరాయ్‌ స్ట్రీమింగ్‌ కానుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. 

మరిన్ని వార్తలు