Nani: ప్రాణం పెట్టి చేశా, ఇమేజ్‌ను కాపాడుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు

19 Mar, 2023 06:04 IST|Sakshi

– నాని

‘‘దసరా’ కోసం ప్రాణం పెట్టి చేశాను. ఈ సినిమా తర్వాత నా కెరీర్‌ ఏ స్థాయిలో ఉంటుందనేది దేవుడికి వదిలేస్తున్నా. ఫలానా ఇమేజ్‌ని కాపాడుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. నా మనసుకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా’’ అని హీరో నాని అన్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తీ సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘దసరా’. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 30న విడుదలకానుంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్‌ శ్రీకాంత్‌కు తెలిసిన ప్రపంచమే ‘దసరా’ సినిమా. మాకు కొత్త ప్రపంచాన్ని చూపించాడు. తెలంగాణలోని వీర్లపల్లి ప్రాంతమంతా సెలబ్రేట్‌ చేసుకునే చిత్రమిది. దేశమంతా మా ‘దసరా’ విడుదల కోసం ఎదురు చూస్తోందని ప్రమోషన్‌ టూర్‌లో మాకు అర్థమయింది. సుధాకర్‌గారికి ఈ సినిమాతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయని భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘నానీగారితో ‘దసరా’ తీసేందుకు మూడేళ్లు ఎదురు చూశాం’’ అన్నారు సుధాకర్‌ చెరుకూరి. ‘‘ఈ మూవీని అందరూ ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు శ్రీకాంత్‌ ఓదెల. నటీనటులు ఝాన్సీ, నాగబాబు మాట్లాడారు.

మరిన్ని వార్తలు