పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాటకం ఫేమ్‌ అశీష్ గాంధీ

10 Mar, 2021 18:20 IST|Sakshi

'నాటకం' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అశిష్ గాంధీ. రగ్డ్ లుక్‌లో కనిపించి తొలి సినిమాతోనే మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో అయన తరువాతి చిత్రం మొదలైంది. 'నాటకం' చిత్ర దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. 'నాటకం' సినిమాతో తన ప్రతిభ చాటుకున్న కళ్యాణ్ జీ ఆ చిత్రంతో విమర్శకుల ప్రశంశలు పొందాడు. కాగా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు అశీష్ గాంధీ.

విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుమల రెడ్డి సహా నిర్మాతగా ఉండగా, మణికాంత్ కూర్పుని అందిస్తున్నారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో భారీ తారాగణంతో షూటింగ్‌కి వెళ్లబోతుంది. మొత్తంగా ఈ సినిమాలో మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తుండగా.. తాజాగా పోలీస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది..  

ఈ సందర్భంగా నిర్మాత నాగం తిరుపతి రెడ్డి  మాట్లాడుతూ ‘‘విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఈ సినిమా తెరకెక్కుతుంది. దర్శకుడు చెప్పిన కథ చాలా బాగుంది. ఈ కథకి హీరోగా అశిష్ గాంధీ మాత్రమే సూట్ అవుతాడనిపించింది. ఇటీవలే జరిపిన ఫోటోషూట్ లో మూడు డిఫరెంట్ పాత్రలకు అశీష్ గాంధీ చాల బాగా సూట్ అయ్యాడు. మా బ్యానర్ నుండి రాబోతున్న ఈ సినిమా అందరికి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.  ఏప్రిల్ రెండో వారంలో షూటింగ్ వెళ్ళబోతున్నాం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు