Sandhya Raju: 'నాట్యం' ఫేమ్‌ సంధ్యారాజు ఎవరి కూతురో తెలుసా?

22 Oct, 2021 17:34 IST|Sakshi

Natyam Movie Heroine Sandhya Raju Family Background Details: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఉపాసన,ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, వెంకటేశ్‌, చిరంజీవి లాంటి ప్రముఖులు నాట్యం చిత్రాన్ని ప్రమోట్‌ చేయడంతో ఈ సినిమాకు తొలి నుంచే పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది.చదవండి : కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి

అయితే క్షణం తీరిక లేకుండా గడిపే బిగ్‌ స్టార్స్‌ ఇంత ప్రత్యేకంగా ఈ సినిమాను ఎందుకు ప్రమోట్‌ చేస్తున్నారు? అసలు ఎవరీ సంధ్యారాజు అనే చర్చ సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంతకీ ఈమె ఎవరంటే... వేల కోట్లకు అధిపతి, రాంకో సిమెంట్‌ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామరాజు పెద్ద కుమార్తెనే సంధ్యారాజు. అంతేకాకుండా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్నకోడలు.

సంధ్యారాజు స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. పేరు, ప్రఖ్యాతలున్న కుటుంబంలో పుట్టినా ఆమె స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దేశ విదేశాల్లో కలిపి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం.


ప్రస్తుతం ఆమె రాజు రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్‌ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. 

చదవండి : Natyam Movie Review: ‘నాట్యం’మూవీ రివ్యూ
డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్‌

మరిన్ని వార్తలు