Nayantara Twins: నయన్‌ కవలల పిక్‌ షేర్‌ చేసిన భర్త విఘ్నేశ్‌ శివన్‌

20 Mar, 2023 13:27 IST|Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార-దర్శకుడు విఘ్నేశ్‌ గతేడాది జూన్‌లో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన నయన్, విఘ్నేశ్‌లు లివింగ్ రిలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదు నెలలు తిరక్కుండానే సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఈ వ్యవహరం వివాదం మారింది. అన్ని నిబంధనల ప్రకారమే తాము సరోగసికి వెళ్లామని నయన్‌ దంపతులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవడంతో వివాదం సద్దుమనిగింది. 

చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌

కవలలు జన్మించి నెలలు గడుస్తున్న ఇంతవరకు వారి ఫేస్‌ రివీల్‌ చేయలేదు ఈ జంట. దీంతో నయన్‌ పిల్లలను చూసేందుకు నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త విఘ్నేశ్‌ తాజాగా చిన్నారుల క్యూట్‌ పిక్స్‌ షేర్‌ చేశాడు. ఎప్పటిలాగే వారి ముఖం కనిపించకుండ విఘ్నేశ్‌ జాగ్రత్త పడ్డాడు. దీంతో నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు’ అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. 

చదవండి: షాకింగ్‌: లాకర్‌లోని రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ

కాగా నయన్‌, విఘ్నేశ్‌లు చిన్నారుల చేతులు పట్టుకుని ఉన్న ఫొటోలన పోస్ట్‌ చేస్తూ.. ‘ఆనందం అనేది మన ప్రియమైన వారితోనే ముడిపడి ఉంటుంది. ప్రేమ అంటేనే ఆనందం.. ఆనందం అంటనే ప్రేమ’ అంటూ విఘ్నేశ్‌ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు. కాగా ఇటీవల ఈ స్టార్‌ కపుల్‌ తమ కవలలతో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో  మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. కాగా తమ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఉయిర్ అంటే ప్రపంచం అని.. ఉలగం అంటే జీవితం అని అర్ధం. 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు