Nayanthara-Vignesh Shivan: శ్రీవారిని దర్శించుకున్న నయనతార దంపతులు

10 Jun, 2022 14:08 IST|Sakshi

హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న గురువారం మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ లవ్‌బర్డ్స్‌.. దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు.

కాగా ఆరేళ్లుగా ప్రేమలో మునిగి తేలిన నయన్‌-విక్కీలు జూన్‌ 9వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో జరిగిన వీరి వివాహ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, హీరో కార్తీతో పాటు కోలీవుడ్‌కు చెందిన దర్శక-నిర్మాతలు సినీ ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ తన మేనేజర్‌ పూజా దద్లానీ, డైరెక్టర్‌ అట్లీతో కలిసి ఈ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు