Katrina Kaif: చూడ ముచ్చటగా ఉన్న విక్ట్రీనా, తాలిబొట్టు, సింధూరంతో ‘మల్లీశ్వరి’

14 Dec, 2021 20:49 IST|Sakshi

బాలీవుడ్‌ నూతన వధూవరులు విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. వివాహం అనంతరం జైపూర్‌లో హానీమూన్‌ ట్రిప్‌ ముగించుకుని మంగళవారం(డిసెంబర్‌ 14) ముంబై చేరుకున్నారు ఈ నూతన వధువరులు.

ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన విక్ట్రీనాలు మీడియాకు ముందుకు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ ముందు మీడియాతో కొద్ది క్షణాలు ముచ్చటించి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

తొలిసారి భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడంతో మీడియా తమ కెమెరాలకు పని చెప్పింది. 

ఈ సందర్భంగా కత్రినా నుదిటన సింధూరం, తాలిబొట్టు, పెళ్లి గాజులు ధరించి కొత్త పెళ్లి కూతురు లుక్‌లో ఆకట్టుకుంటోంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పక్కనే విక్కీ ఫార్మల్‌ లుక్‌లో కనిపించాడు. ఇలా కత్రినా, విక్కీలు భార్య భర్తలుగా చూడముచ్చటగా కనిపించారు.

ఇక తమ అభిమాన జంటను తొలిసారి భార్యభర్తలుగా చూసిన విక్ట్రీనా ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. 

మరిన్ని వార్తలు