సింగర్ సిద్ధూ మూసేవాలా మృతి తట్టుకోలేక బోరుమని ఏడ్చేసింది నిక్కీ తంబోలి. ఇందుకు సంబంధించిన వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. కొంతమంది ఆమె బాధను వక్రీకరిస్తూ ఆమెది దొంగ ఏడుపని, జస్ట్ యాక్టింగ్ చేస్తోందని ట్రోల్ చేశారు. తాజాగా తనపై జరిగిన ట్రోలింగ్పై స్పందించింది నిక్కీ. నేను నవ్వినా, ఏడ్చినా జనాలు నన్ను ట్రోల్ చేస్తూనే ఉంటారు అని కామెంట్ చేసింది.
నాకు సిద్ధూ మూసేవాలా పనితనం ఎంతో నచ్చేది. బిగ్బాస్ షోలో ఉన్నప్పుడు కూడా నేను అతడి గురించి మాట్లాడాను. గతేడాది కెనడాలో ఆయన్ను ఓసారి కలిశాను. అలాంటిది ఆయన చనిపోయాడని తెలిసినప్పుడు ఎంతో బాధేసింది. అదే సమయంలో ఆయన గురించి అడిగేసరికి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అది సర్వసాధారణం. నా సొంత సోదరుడు చనిపోయిన సమయంలో ఖత్రోన్ కె ఖిలాడీలో నవ్వుతూ కనిపించినందుకు ట్రోల్ చేశారు. ఇప్పుడు నేను ఏడ్చినా కూడా ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు. నవ్వినా, ఏడ్చినా.. తిట్టడమే వాళ్ల పని.. అది నన్నేం బాధ పెట్టదు. విమర్శ మంచిదే.. ఎందుకంటే దానివల్ల మరింత కష్టపడి పనిచేయాలనిపిస్తుంది. కాబట్టి విమర్శలు నన్నెప్పుడూ బాధించవు అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఘోస్ట్ మూవీ నేరుగా ఓటీటీలోకి రాబోతోందా?
మహేశ్బాబు, అల్లు అర్జున్తో తన్నులు తినాలనుంది: అఖండ విలన్