‘రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే

29 May, 2021 08:54 IST|Sakshi

నితిన్‌, కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ రీలీజైన నాటి నుంచి చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది. దీనికి తోడు నితిన్‌-కీర్తి చేసిన ప్రమోషన్‌ వీడియోలు ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి రంగం సిద్ధమైంది.  జూన్‌ 12 నుంచి జీ5లో రంగ్‌దే సినిమా స్ర్టీమింగ్‌ కానుంది. దీనికి సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వార్తలు