చివరి షెడ్యూల్లో చెక్‌

18 Oct, 2020 02:56 IST|Sakshi

నితిన్‌ హీరోగా రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియాప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘చెక్‌’. వి. ఆనందప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నూతన షెడ్యూల్‌ ఈ నెల పదో తేదీన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్‌’ అని టైటిల్‌ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వచ్చింది. వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. ప్రస్తుతం నితిన్, రకుల్‌ప్రీత్, సంపత్‌రాజ్, సాయిచంద్‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు.

మరిన్ని వార్తలు