Dj Tillu Sequel: 'డీజే టిల్లు' హీరోయిన్‌ను మార్చేశారు.. రాధికా కాదట

15 Aug, 2022 12:45 IST|Sakshi

యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ఏడాది బ్రేక్‌ ఇచ్చిన సినిమా డీజే టిల్లు. విమ‌ల్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. సిద్దూ న‌ట‌న‌, డైలాగ్ డెలివ‌రీ యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్‌ నటించనున్నట్లు తెలుస్తుంది. రౌడీ బాయ్స్‌ చిత్రంతో రొమాన్స్‌ డోస్‌ పెంచిన అనుపమ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్‌ బిజీ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె నిఖిల్‌తో ’18పేజీస్‌’, ‘బ‌టర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది. 

మరిన్ని వార్తలు