Jr NTR And Koratala Shiva Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ తర్వాత తారక్ వరుసగా మూడు ప్రాజెక్ట్లకు సంతకం చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ల ప్రాజెక్ట్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి కావడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్లను పట్టాలెక్కించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేస్తుకుంటున్నాడట. ఈ క్రమంలో ముందుగా కొరటాలతో ఎన్టీఆర్ 30(#NTR 30) మూవీ చేయన్నాడు.
చదవండి: మూడింతల ఎక్కువ ఫన్తో `ఎఫ్ 3`.. మేకింగ్ వీడియో వైరల్
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకున్నాడట. ఈ మూవీని 6 నెలల్లోగా పూర్తి చేయాలని కొరటాలకు చెప్పినట్లు టాలీవుడ్లో టాక్. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎక్కువ సమయం తీసుకోవడంతో ఈ ఎడాది ఆయన సినిమాల సంఖ్య తగ్గింది. దీంతో వచ్చే ఏడాదిలో అయిన కనీస సినిమాలు చేయాలనే ఉద్దేశంతో శరవేగంగా షూటింగ్స్ను పూర్తి చేయాలనుకుంటున్నాడట. అంతేగాక ఇప్పటికే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు గడుస్తున్నాయి.
చదవండి: సమంతే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవర్.. రీట్వీట్ చేసిన సామ్
ఆ సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చేందుకే ఎన్టీఆర్, కొరటాలకు ఈ షరతు పెట్టినట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీకి ‘డైమండ్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి సంఘ నాయకుడిగా కనిపించబోతున్నాడట. ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడకు చెందిన ప్రముఖ నటీనటులను కూడా దర్శకుడు భాగస్వామ్యం చేయనున్నాడని వినికిడి. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్న కొరటాల అనంతరం ఎన్టీఆర్ మూవీని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.