ధనుష్‌ ‘నేనే వస్తున్నా’నుంచి ‘ఒకే ఒక ఊరిలోనా..’సాంగ్‌ రిలీజ్‌

25 Sep, 2022 13:40 IST|Sakshi

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన తాజా చిత్రం ‘నానే వరువెన్‌’. తెలుగు ఈ చిత్రాన్ని ‘నేనే వస్తున్నా’పేరుతో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ సమర్పిస్తుంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ పాటను విడుదల చేశారు. ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా’సాగే ఈ పాటకు చంద్రబోస్‌ లిరిక్స్‌ అందించగా, ఎస్.పి.అభిషేక్, దీపక్ బ్లూ అలపించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చాడు. 

‘పాముల్లోనా విషముంది,పువ్వులోని విషముంది..పూలను తల్లో పెడతారే పామును చూస్తే కొడతారే మనిషిలో మృగమే దాగుంది, మృగములో మానవత ఉంటుంది’ లాంటి లైన్స్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న ధనుష్ లోని రెండు విభిన్నకోణాలని ఆవిష్కరించడమే కాకుండా,  ఆలోచించే విధంగా ఉన్నాయి. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుష్ ,సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న 4వ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 29 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు