‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అంటున్న నిహారిక

28 Mar, 2021 01:33 IST|Sakshi

విజయ్‌ సేతుపతి, నిహారిక జంటగా ఆర్ముగ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్‌ పాత్తు సొల్రేన్‌’. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని రావూరి అల్లికేశ్వరి సమర్పణలో డాక్టర్‌ రావూరి వెంకటస్వామి  తెలుగులో ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ– ‘‘విజయ్‌సేతుపతి నటన హైలైట్‌. ఇంతకు ముందు చేయని పాత్రలో నిహారిక కనిపిస్తారు. మంచి మాస్‌ యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌ మూవీ’’ అన్నారు.

మరిన్ని వార్తలు