Maruva Tarama : ఆకట్టుకుంటున్న 'మరువ తరమా' ఫస్ట్‌ సాంగ్‌

8 May, 2023 18:51 IST|Sakshi

డిఫరెంట్‌ కంటెంట్‌తో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా 'మరువ తరమా'. అద్వైత్‌ ధనుంజయ, అతుల్య రవి హీరోహీరోయిన్లుగా నటించారు.చైతన్య వర్మ నడింపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే అనే సాంగ్‌ని రిలీజ్‌ చేశారు.

పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఈ సాంగ్‌ను పాడాడు. ముఖ్యంగా ఈ పాటలో చూపించిన లోకేషన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ సాంగ్‌ కూడా సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ని క్రియేట్‌ చేస్తుందని మేకర్స్‌ తెలిపారు. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ వెల్లడిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు