Pakka Commercial: ఓటీటీలోకి వచ్చేస్తున్న పక్కా కమర్షియల్‌, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

31 Jul, 2022 10:34 IST|Sakshi

మ్యాచో హీరో గోపీచంద్‌, హీరోయిన్‌ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఆగస్టు 5 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. మరింకే... థియేటర్లలో సినిమా చూడటం మిస్‌ అయినవాళ్లు ఆహాలో మూవీ రిలీజ్‌ కాగానే ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి..

చదవండి: గ్యారేజీలో అనిల్‌ కాపురం.. హీరోయిన్‌తో సునీల్‌ దత్‌ లవ్‌స్టోరీ..
హఠాత్తుగా వీగన్‌గా మారిపోయా.. కొత్తలో చాలా కష్టంగా ఉండేది: నుస్రత్‌

మరిన్ని వార్తలు