Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి

19 Nov, 2022 04:17 IST|Sakshi

భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్‌ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు.

‘‘అటల్‌ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్‌ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్‌ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు