పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళం మూవీ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఇది. ఇందులో నిత్యామీనన్, ఐశ్యర్యరాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీమేక్ మూవీ కావడంతో ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి కరోనా మహహ్మారి బ్రేకులు వేసింది. అయినప్పటికీ ఈ సినిమా వచ్చే ఏడాది దసరాకి విడుదల చేయాలని భావిస్తున్నారట చిత్ర యూనిట్.
ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీని కూడా దసరాకే విడుదాల చేయాలని భావించారు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ని విడుదల చేస్తానమని చిత్ర యూనిట్ ప్రకటించింది కూడా. అయితే కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. వాయిదా వేస్తున్నట్లు ప్రకటించలేదు. మరి అనుకున్న ప్రకారం రెండు సినిమాలు దసరాకే వస్తే.. కచ్చితంగా కలెక్షన్లపై ప్రభావం ఉంటుంది.
చదవండి: ఆ హిట్ డైరెక్టర్తోనే వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ