సెట్లోకొచ్చానోచ్‌!

16 Sep, 2020 04:25 IST|Sakshi

కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత ఒక్కొక్కరుగా సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు స్టార్స్‌. తాజాగా షూటింగ్‌ ప్రారంభించారు పూజా హెగ్డే. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో మంగళవారం జాయిన్‌ అయ్యారు పూజా హెగ్డే. ‘మళ్లీ సెట్లోకొచ్చాను’ అని తన టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేశారామె. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. ఈ రొమాంటిక్‌–ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు గోపీసుందర్‌ సంగీత దర్శకుడు. 

మరిన్ని వార్తలు