Pooja Hegde: పూజాకు నిర్మాతలు షాక్‌, ఆ బిల్లులు కట్టమని చేతులెత్తేశారట!

23 Jun, 2022 20:01 IST|Sakshi

ప్రస్తుతం సౌత్‌లో పూజా హెగ్డేకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దక్షిణాది స్టార్‌ హీరో అందరి సరసన నటించి అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు, పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తూ పూజా బిజీగా మారింది. అయితే ఇటీవల పూజా నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌లు ఫ్లాప్‌ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలు పరాజయం కావడానికి పూజా హెగ్డేనే కారణమని, ఆమెది ఐరన్‌ లెగ్‌ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో పూజాకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కోడుతుంది.

ఓ బడా నిర్మాత పూజాకు షాకిచ్చినట్టు తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. బీస్ట్‌ మూవీ షూటింగ్‌ సమయంలో పూజా హెగ్డే స్టాఫ్‌కు సంబందించిన ఖర్చులు భారీగా వచ్చాయట. కేవలం వీరి ఫుడ్‌ కోసమే లక్షల్లో బిల్లు అయిందట. రీసెంట్‌గా వీటికి సంబంధించిన బిల్లులు బీస్ట్‌ నిర్మాతలకు అందాయట. ఇక ఆ బిల్లు చూసిన నిర్మాతలు ఒక్కసారిగా కంగుతిన్నారని వినికిడి. పూజా స్టాఫ్‌ ఫుడ్‌కు, మెయింటెన్స్‌కు అయిన బిల్లు చూసి నిర్మాతలు ఒక్కసారిగా చుక్కలు చూశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీస్ట్‌ మూవీ డిజాస్టర్‌తో భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు పూజా, ఆమె స్టాఫ్‌కు అయిన ఖర్చులు మరింత భారమయ్యాయట.

దీంతో ఈ బిల్లులతో తమకు సంబంధం లేదని, తన స్టాఫ్‌కు అయిన ఖర్చులను ఆమె భరించాలంటూ నిర్మాతలు ఆ బిల్లును పూజాకు పంపినట్లు సమాచారం. ఇక సినిమా ఫ్లాప్‌ అవ్వడంతో పూజా కూడా దీనిపై నోరు విప్పకుండ ఆ బిల్లును తానే కట్టాలని నిర్ణయించుందని సినీవర్గాల నుంచి సమాచారం. అయితే అ వార్తల్లో నిజమెత్తుందో తెలియదు. మరి దీనిపై పూజా, బీస్ట్‌ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే గతంలో పూజా నిర్మాతలకు మరింత భారమయ్యాలే వ్యవహరిస్తుందని ఓ దర్శకుడు కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాను మాత్రమే కాకుండా తన స్టాఫ్‌ని సైతం షూటింగ్‌కు తీసుకువస్తుందని, వారికి అయ్యే ఖర్చు నిర్మాతలకు భారమే కదా అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు