సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది హీరోయిన్ పూనమ్ కౌర్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనమ్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటోపై తెగ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలతో ఫోటో దిగిన పూనమ్ దీనికి హ్యాపీనెస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో క్షణాల్లోనే ఆ పోస్ట్ వైరల్గా మారి పూనమ్కు పెళ్లయి, పిల్లలున్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా ఈ వార్తలపై పూనమ్ కౌర్ స్పందించింది. 'ఇప్పటివరకు జరిగిన డ్యామేజ్ చాలు, వాళ్లు నా బెస్ట్ ఫ్రెండ్ పిల్లలు. సోషల్ మీడియాకు థ్యాంక్స్. నేను క్లారిటీ ఇవ్వగలుగుతున్నాను. నన్ను కాస్త ఊపిరి తీసుకోనివ్వండి' అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. దీంతో పుకార్లకు చెక్ పెట్టినట్లయ్యింది.
Enough unbearable damage has been done , these are my best friends kids. Thankful to social media , that I can give clarity. 🙏
Let me breathe🙏 pic.twitter.com/4yyCPMuRDn
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 4, 2022