22 ఏళ్ల తర్వాత..

30 Dec, 2020 06:30 IST|Sakshi

కమల్‌హాసన్‌–ప్రభుదేవా మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారా? అంటే కోలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో కమల్‌ హీరోగా ‘విక్రమ్‌’ అనే చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను ప్రభుదేవా చేయనున్నారని సమాచారం. 1998లో కమల్‌–ప్రభుదేవా ‘నవ్వండి లవ్వండి’ అనే చిత్రంలో నటించారు. అది కామెడీ ఎంటర్‌టైనర్‌. తాజా చిత్రం ‘విక్రమ్‌’ పొలిటికల్‌ థ్రిల్లర్‌. త్వరలో షూటింగ్‌ ఆరంభించి, తమిళనాడు ఎన్నికల ముందే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోందట.

మరిన్ని వార్తలు