My Dear Bootham OTT Release: ప్రభుదేవా మైడియర్‌ భూతం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

29 Aug, 2022 10:28 IST|Sakshi

కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని అన్నిరకాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు ప్రభుదేవా. ఇటీవలే ఆయన మై డియర్‌ భూతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిషేక్ ఫిలింస్‌ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించగా శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ దీన్ని తెలుగులో విడుదల చేశారు.

జూలై 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్‌ 2న ఈ సినిమా జీ5లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. మరింకే.. థియేటర్‌లో సినిమా చూడటం మిస్‌ అయిన పిల్లలు ఈ శుక్రవారం ఎంచక్కా మై డియర్‌ భూతం చూసేయండి..

చదవండి: ఒకే భవనంలో అపార్ట్‌మెంట్స్‌ కొన్న ఇద్దరు స్టార్‌ హీరోలు!
విమానాశ్రయంలో ఇళయరాజా పడిగాపులు

మరిన్ని వార్తలు