ప్రభుదేవాకు జంటగా వరలక్ష్మీశరత్‌కుమార్

16 Jul, 2021 07:37 IST|Sakshi

చెన్నై: డాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సంతోష్‌ విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మినీ స్టూడియో పతాకంపై ఎస్‌.వినోద్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభుదేవాకి జంటగా వరలక్ష్మీశరత్‌కుమార్, రైసా విల్సన్‌ కథానాయికలుగా నటించనున్నారు. దీనికి బల్లు ఛాయాగ్రహణం, డి.ఇమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ బ్యానర్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు