Prabhudeva: ప్రభుదేవా 'మై డియర్ భూతం' రిలీజ్‌ డేట్‌ ఖరారు..

6 Jul, 2022 17:39 IST|Sakshi

Prabhudeva My Dear Bootham Movie: టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా సుపరిచితమే. ఈ ఫేమ్ కంటిన్యూ చేస్తూనే హీరోగా, దర్శకుడిగా తన టాలెంట్ బయటపెట్టి ప్రశంసలందుకున్నారు ప్రభుదేవా. ఆయన ముఖ్య పాత్రలో నటించిన కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్లై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. 

తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా జూలై15న విడుదల చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రమని వారు తెలిపారు. 
 


ఈ చిత్రంలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇక ఈ సినిమాను ఇప్పటికే చూసిన జీ నెట్‌వర్క్‌ టీమ్.. భారీ ధర చెల్లించి 'మై డియర్ భూతం' ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు