చెన్నైలో ప్రారంభమైన ప్రభుదేవ కొత్త సినిమా

10 Aug, 2021 08:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: నటుడు, దర్శకుడు ప్రభుదేవా హీరోగా ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ప్రముఖ గీత రచయిత, నటుడు పా.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభుదేవాకు జంటగా మహిమా నంబియార్‌ నటిస్తోంది. ఎంఎస్‌ మూవీస్‌ పతాకంపై కె.మురుగన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గణేషన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో కలైయరసన్, అర్జయ్‌ వంటి తదితర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

మరిన్ని వార్తలు