Prithviraj Sukumaran Nayanthara: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్​

6 Jun, 2022 19:56 IST|Sakshi

Prithviraj Sukumaran Nayanthara Gold First Look Poster Released: మలయాళ స్టార్​ హీరో పృథ్వీరాజ్​ సుకుమారన్​ గురించి ఎంత చెప్పిన తక్కువే. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్​గా విభిన్నమైన కథలతో అభిమానులను, సినీ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చేసే ప్రతి సినిమాలో ఎంతో కొంత వైవిధ్యం తప్పకుండా ఉంటుంది. అయ్యప్పనుమ్​ కోషీయమ్, బ్రో డాడీ, జన గణ మన సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒక్క ఏడాదిలోనే 20 సినిమాలు ఒప్పుకున్నట్లు టాక్​ వినిపిస్తోంది. అందులో వెబ్ సిరీస్​లు, సినిమాలు ఉండగా ఒక్కొక్కటి ఒక్కో ఫార్మాట్​లో ఉండనుందని సమాచారం. 

ఇందులో భాగంగానే తాజాగా తన కొత్త చిత్రం 'గోల్డ్​' ఫస్ట్​ లుక్​ పోస్టర్​ను విడుదల చేశాడు పృథ్వీరాజ్​ సుకుమారన్. ఈ సినిమాలో హీరోయిన్​గా లేడీ సూపర్​ స్టార్​ నయనతార నటిస్తోంది. ఈ పోస్టర్​లో చుట్టూ మనుషులతో మధ్యలో నయనతార అయోమయంగా చూస్తుంటే పృథ్వీరాజ్​ సుకుమారన్ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్​ నెట్టింట వైరల్​ అవుతోంది.

చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్​.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం


ఈ మూవీని పృథ్వీరాజ్​ ప్రొడక్షన్స్​, మ్యూజిక్​ ఫ్రేమ్స్​ బ్యానర్లపై సుప్రియా మీనన్, లిజిన్​ స్టీఫెన్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ప్రేమమ్'​ మూవీ ఫేమ్​ అల్ఫోన్స్​ పుత్రెన్​ దర్శకత్వం వహిస్తున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత అల్ఫోన్స్​ డైరెక్టర్​గా తన మార్క్​ చూపించనున్నారు. ఈ సినిమాను ఆగస్టు 19న విడుదల చేయనున్నారు.  

చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు

మరిన్ని వార్తలు