ప్రియాంక చోప్రా మరోసారి ఎమోషనల్‌.. సహాయం కోసం విజ్ఞప్తి

27 Apr, 2021 21:00 IST|Sakshi

భారత్‌లోని తాజా పరిస్థితులపై గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి ఎమోషనల్‌ అయింది. దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు అందించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర ప్రభుత్వ అధికారులకు సోషల్‌ మీడియా వేదికగా విన్నవించింది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, వీడియోలను చూసి మనసు తరుక్కుపోతోందని తెలిపింది. 

‘భారత్‌లో పరిస్థితి చాలా విషమంగా ఉంది. దయచేసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను భారత్‌కు సరఫరా చేయాలని అమెరికా ప్రభుత్వ అధికారులను కోరుతున్నాను. 550 మిలియన్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్స్‌ అమెరికా ఆర్డర్‌ చేసింది. అమెరికాకు కావాల్సిన దానికంటే ఎక్కువ వ్యాక్సిన్లు వారి వద్ద ఉన్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలకు అమెరికా వ్యాక్సిన్‌ను అందిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం.ప్రస్తుతం భారత్‌ చాలా ఇబ్బందుల్లో ఉంది. వెంటనే ఇండియాకువ్యాక్సిన్ పంపించగలరా? అని ప్రియాంక కోరింది.  ప్రస్తుతం ప్రియాంక  ‘సిటాడెల్‌’ అనే అమెజాన్‌ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్‌ 4’లోనూ నటిస్తోంది.
 

మరిన్ని వార్తలు