Dil Raju : 'అందుకే రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. నా కూతురు ఏమందంటే'..

29 Nov, 2022 15:16 IST|Sakshi

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ ప్రారంభించి ప్రస్తుతం స్టార్‌ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌ చిత్రాలను రూపొందిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ‍ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక దిల్‌రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2017లో ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో 2020లో తేజస్విని(వైఘా రెడ్డి)తో ఆయనకు రెండో వివాహం జరిగింది.

తాజాగా తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. '' నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మెంటల్లీ చాలా స్ట్రగుల్‌ అనిపించింది. ఆ టైంలో కూతురు, అల్లుడు నాతోనే ఉండేవారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ప్రయత్నించా. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్‌. నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్‌ ఉండలేకపోయారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్‌ చేశారు.

నా కూతురు హన్షితా కూడా సపోర్ట్‌ చేసింది. నా ఫ్యామిలీ డిస్టర్బ్‌ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా'' అంటూ దిల్‌రాజు పేర్కొన్నారు. కాగా ఇటీవలె ఈ దంపతులకు  కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్‌ రెడ్డి అని పేరు పెట్టారు.

చదవండి : హీరోల క్యారవాన్‌ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్‌ కామెంట్స్‌ 

మరిన్ని వార్తలు