కరోనాకు మరో నిర్మాత బలి

2 May, 2021 13:34 IST|Sakshi

సాక్షి, యశవంతపుర: కరోనా వైరస్‌ కన్నడ చిత్ర రంగాన్ని కుదిపేస్తోంది. ఇటీవల నిర్మాత రాము మృతి చెందగా శుక్రవారం మరో నిర్మాత రాజశేఖర్‌ వైరస్‌కు బలయ్యారు. నీనాసం సతీష్‌ నటిస్తున్న 'పెట్రోమ్యాక్స్‌' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్న రాజశేఖర్‌ సినిమా విడుదలకు ముందే కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు నటులు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు.

చదవండి: KV Anand: ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు