దిలీప్ కుమార్ మల్లా-రోషిణి పటేల్ సింగాని జంటగా నటించిన చిత్రం పల్స్. ఆర్.టి.మూవీ మేకర్స్ పతాకంపై రమణ తూముల స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ప్రముఖ సినీ రచయిత కె.శివశక్తి దత్తా (కీరవాణి ఫాదర్) సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ టీంకు ఆల్ది చెప్పారు.
కాగా ఈ సినిమాలో ఈ చిత్రంలో కేరాఫ్ కంచరపాలెం రాధ, చంద్రశేఖర్ పాత్రుడు, డాక్టర్ శివరాం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి నిజాని అంజన్ సంగీతం సమకూర్చారు.ఈ చిత్రానికి కెమెరామెన్: చందు ఏజే, ఎడిటింగ్. ఉదయ్ చైతన్య (బాబి).