-

Puri Jagannadh: రూ. 2 కోట్లు ఇస్తే రిటర్న్‌ పంపించాడు: విజయ్‌పై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు

16 Aug, 2022 14:24 IST|Sakshi

ప్రస్తుతం ఎక్కడ చూసిన లైగర్‌ మూవీ జోరు కనిపిస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర బృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన లైగర్‌ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో దర్శకుడు పూరీజగన్నాథ్‌ మాట్లాడుతూ.. విజయ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. తన భార్య లావణ్య చెప్పడం వల్లే అర్జున్‌ రెడ్డి సినిమా చూశానన్నాడు.

చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌, బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్‌

‘‘అర్జున్ రెడ్డి చూసిన నా భార్య కొత్త దర్శకులు వస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. నువ్వు వెనుకబడిపోతున్నావ్. ఎవరో సందీప్ రెడ్డి వంగా అట. కొత్తగా వచ్చాడు. విజయ్ అనే యువ నటుడితో అర్జున్ రెడ్డి తీశాడు. చాలా బావుంది’ అని లావణ్య చెప్పడంతో ఆ సినిమా చూశా. 5 నిమిషాలయ్యే సరికి ఆ తర్వాత సినిమాలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపించలేదు. కేవలం విజయ్ యాక్టింగ్‌పైనే నా ఫోకస్ నిలిచిపోయింది. అతడి నటనలో నిజాయితీ కనిపించింది. అతడితో ఎలాగైనా సినిమా చేయాలనుకున్నాను. అది లైగర్ ద్వారా తీరింది’’ అంటూ పూరీ చెప్పుకొచ్చాడు. అప్పుడే విజయ్‌తో తప్పుకుండ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని అన్నాడు.

చదవండి: బాలీవుడ్‌కు బాయ్‌కాట్‌ సెగ, మరో స్టార్‌ హీరోపై విరుచుకుపాటు

అలాగే మూవీ షూటింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర విషయాన్ని ఈ సందర్భంగా పూరీ పంచుకున్నాడు. లైగర్‌ మూవీ షూటింగ్‌ సమయంలో విజయ్‌కి రెండుసార్లు డబ్బులు పింపిస్తే అవి తిరిగి పంపించాడంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. ‘మూవీ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ నిర్మాతగా విజయ్‌కి ఓసారి కోటి రూపాయలను పంపించా. దానికి ఇప్పుడు వద్దని, ముందు సినిమా కోసం ఖర్చు చేయమని డబ్బు వెనక్కి పంపించాడు. మళ్లీ కొద్ది రోజులకు రూ.2 కోట్లు పంపిస్తే నాకు అప్పులు ఉన్నాయని తెలిసి అవి కట్టమని చెప్పాడు’ అని పూరీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఇలాంటి నటుడిని ఇంతవరకు తాను చూడలేదని, విజయ్‌లో ఎక్కడా పొగరు కనిపించదంటూ పూరీ ప్రశంసలు కురిపించాడు.

మరిన్ని వార్తలు