ముచ్చటగా మూడోసారి

12 Oct, 2020 00:13 IST|Sakshi

నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో గతంలో ‘శివమణి’ సూపర్‌’ చిత్రాలు తెరకెక్కాయి. మూడోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథాంశం ఉంటుందన్నది ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’ చేస్తున్నారు. అలాగే ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు పూరి జగన్నాథ్‌ తన తొలి ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘ఫైటర్‌’తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక పూరి, నాగార్జున చిత్రం సెట్స్‌ మీదకు వెళుతుందని సమాచారం.

మరిన్ని వార్తలు