ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి: పూరీ

18 Mar, 2021 08:05 IST|Sakshi
పూరీ జగన్నాథ్, చార్మీతో ‘బ్యాక్‌ డోర్‌’ చిత్రబృందం

పూర్ణ ప్రధాన పాత్రలో నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. తేజ హీరోగా ఆర్కిడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌ సమర్పణలో బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని ‘రారా నన్ను పట్టేసుకుని’ అని సాగే పాటను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఆవిష్కరించారు. ముంబయ్‌లోని పూరీ కార్యాలయంలో జరిగిన ఈ ఆవిష్కరణలో చార్మి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వాలి. సినిమాతో అసోసియేట్‌ అయిన ప్రతి ఒక్కరికీ బంపర్‌ ఆఫర్స్‌ రావాలి’’ అన్నారు. సంగీత దర్శకుడు ప్రణవ్‌ స్వరపరచిన ‘రారా నన్ను...’ ట్యూన్‌కి నిర్మల సాహిత్యం అందించారు. ‘‘లైగర్‌ చిత్రం పనులతో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం టైమ్‌ కేటాయించి, పాటను రిలీజ్‌ చేసి,  సినిమా చాలా పెద్ద విజయం సాధించాలన్న పూరీ జగన్నాథ్‌కి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అని కర్రి బాలాజీ అన్నారు. ‘‘సంగీతదర్శకుడిగా నా మొదటి సినిమాలోని పాటను పూరీ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రణవ్‌. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రేఖ, కో–ప్రొడ్యూసర్‌: ఊట శ్రీను.

మరిన్ని వార్తలు