'పుష్పరాజ్‌' వేట కేరళ అడవుల్లో..

19 Feb, 2021 00:01 IST|Sakshi

పుష్పరాజ్‌ వేట మారేడుమిల్లి అడవుల్లో పూర్తయింది. ఇప్పుడు కేరళ అడవుల్లో ప్రారంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో కనిపించనున్నారు అల్లు అర్జున్‌. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ కేరళలో ప్లాన్‌ చేశారు. కేరళ అడవుల్లో భారీ షెడ్యూల్‌ జరుగునుంది. కొన్ని రోజుల పాటు ‘పుష్ప’ చిత్రబృందం మకాం కేరళలోనే ఉండబోతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగస్ట్‌ 13న విడుదల కానుంది. 
 

మరిన్ని వార్తలు