మారేడుమిల్లి అడవుల్లో...

13 Oct, 2020 00:11 IST|Sakshi

‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా చిత్రీకరణ సాగనుందని తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను శేషాచలం అడవుల్లో, కేరళ అడవుల్లో జరుపుతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ‘పుష్ప’ టీమ్‌ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూట్‌కి రెడీ అయ్యారని టాక్‌. నెల రోజుల ఏకధాటి షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట. నవంబర్‌ మొదటివారంలో ఈ షెడ్యూల్‌ ఆరంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు