Pyaari: సినిమా కంటే ముందే పుస్తకరూపంలో ‘ప్యారీ’

19 Jun, 2022 15:07 IST|Sakshi

మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా హిందీ, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్యారీ’. లక్ష్మణ్ అనే యువకుడు - ప్యారి అనే యువతి నడుమ నడిచిన ప్రేమకు సాక్షాత్కారమే ఈ చిత్రం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుండగానే ఈ ప్రేమకథను పుస్తకం రూపంలో ‘ప్యారి తారావలి ది ట్రూ స్టోరీ’ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.

రజనీష్ దూబే రాసిన ‘ప్యారి - తారావలి ది ట్రూ లవ్ స్టోరీ’ అమెజాన్, ఫ్లిప్ కార్డ్, కిండిల్, ప్లే స్టోర్, గూగుల్ బుక్స్, కోబో, ఐ బుక్స్ వంటి మాధ్యమాల్లో లభ్యం కానుంది. ప్రేమ తాలూకు ఓ గొప్ప పార్శ్వాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే ‘ప్యారి’ ప్రేమాస్పదులైన ప్రతి ఒక్కరినీ రంజింప చేస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు