Natu Natu Song: ఆస్కార్‌ వేదికపై లైవ్‌లో పాడనున్న రాహుల్‌, కాలభైరవ

1 Mar, 2023 13:11 IST|Sakshi

మరికొద్ది రోజుల్లో ప్రపంచమే ఎదురు చూస్తున్న ఆస్కార్‌ సినీ వేడుక జరుగబోతోంది. ఈసారి అందరి దృష్టి ఆర్‌ఆర్‌ఆర్‌ మీదే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులతో మోత మోగించిన ఈ మూవీ ఆస్కార్‌ను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటునాటు పాట బెస్ట్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే! తాజాగా ఫ్యాన్స్‌కు  మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆస్కార్‌ టీమ్‌. 

ఈ నెల 12న జరగబోయే 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సింగర్లు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ నాటు నాటు పాటను లైవ్‌లో పాడనున్నట్లు తెలిపింది. ఈ విషయం తెలిసి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇంకేముంది... మన సింగర్లు స్టేజీపై అగ్గిరాజేయడం ఖాయం. వీరి పాటకు అక్కడున్నవాళ్లకు ఊపు రావడమూ తథ్యం. అంత పెద్ద వేదికపై పాడటం, అది కూడా తెలుగు పాట కావడం గర్వించదగ్గ విషయం. ఈ విషయంపై రాహుల్‌ సిప్లిగంజ్‌ స్పందిస్తూ.. 'ఆస్కార్‌ వేదికపై లైవ్‌ పర్ఫామెన్స్‌.. కచ్చితంగా ఇవి నా జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి' అని సంతోషం వ్యక్తం చేశాడు.

చదవండి: మా నాన్న కంటే నా భార్యకే ఎక్కువగా భయపడతా: మంచు విష్ణు

మరిన్ని వార్తలు