Sedyam: ఆకట్టుకుంటున్న ‘రైతే రాజు’ పాట

16 Oct, 2022 16:55 IST|Sakshi

గౌతమ్ గిరినందన్, కుషాల్ తేజ, నీల రమణ, గాయత్రి రమణ హీరో హీరోయిన్ గా చంద్రకాంత్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న‘సేద్యం’. రాయలసీమ ప్రాంతంలో జరిగిన కొన్ని యాదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జి పి ఆర్ సినిమాస్ పతాకం పై మహేష్ రెడ్డి గోరకాటి, గాజుల పద్మావతి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ రైతే రాజు’ అయితే పాటని విడుదల చేశారు మేకర్స్‌. ‘అమ్మకే అమ్మరా..అన్నదాత అవ్వగా.. పుడమినే దున్ని తాను అన్నమే పెట్టగా..’ అంటూ సాగే ఈ పాట రైతుల దీనస్థితిని వివరిస్తుంది.

పాట విడుదల సందర్భంగా.. ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సేద్యం సినిమా ఇప్పటికే  షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఇందులోని మొదటి  రైతే రాజు పాటను ఈరోజు  రిలీజ్ చేశాం. ఈ చిత్రాని మొత్తం రాయలసీమ లో చిత్రిరించం. అందరికి నచ్చే అందమైన కథ’ అని అన్నారు.

మరిన్ని వార్తలు