Sasanasabha: ఈ విజయం వారిదే.. రాజేంద్రప్రసాద్‌

20 Dec, 2022 09:57 IST|Sakshi

‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్‌ ఉన్న సినిమా తీస్తే ఆదరిస్తామని ప్రేక్షకులు మరోసారి మా ‘శాసనసభ’తో నిరూపించారు. ఈ విజయం వారిదే’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యా రాజ్‌ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసన  సభ’. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘శాసనసభ’లో నేను చేసిన నారాయణ స్వామి పాత్రకి మంచి పేరొచ్చిందంటే దానికి కారణం రచయిత రాఘవేందర్‌ రెడ్డి, దర్శకుడు వేణు.. నాది మూడో స్థానం. సినిమా విడుదలైన మూడో రోజే 60 థియేటర్స్‌ పెరగడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రవిజయం పట్ల యూనిట్‌ ఆనందం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు