శుభాకాంక్షలు

19 Oct, 2020 05:40 IST|Sakshi

ఆయుష్మాన్‌ ఖురానా ముఖ్య పాత్రలో హర్షవర్ధన్‌ కులకర్ణి తెరకెక్కించిన చిత్రం ‘బదాయి హో’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నారు. ‘బదాయి దో’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్‌కుమార్‌ రావ్, భూమి ఫెడ్నేకర్‌ జంటగా నటించబోతున్నారు. ఈ సీక్వెల్‌ను హర్షవర్థన్‌ కులకర్ణి డైరెక్ట్‌ చేస్తారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘శుభాకాంక్షలు. చేయి ఇటు ఇవ్వండి. (శానిటైజ్‌ చేసుకున్నాకే)’’ అంటూ ఈ సీక్వెల్‌ని ప్రకటించారు రాజ్‌కుమార్‌ రావ్‌.

మరిన్ని వార్తలు