టేకాఫ్కి సిద్ధమయ్యారు రకుల్ ప్రీత్సింగ్. కో పైలట్గా తన డ్యూటీని సరిగ్గా చేయడానికి రెడీ అయ్యారు. అజయ్ దేవగణ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం ‘మే డే’. ఇందులో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర చేస్తున్నారు. అమితాబ్ పైలట్, రకుల్ కో పైలట్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బారినపడ్డారు రకుల్. అందులోంచి బయటపడి, షూటింగ్స్కి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారామె. ‘‘పనిలో ఉంటేనే సంతోషంగా ఉంటాను’’ అంటూ సెట్లో మేకప్ చేసుకుంటున్న ఫొటో షేర్ చేశారు రకుల్.