Rakul Preet Singh: విషాదంలో రకుల్‌.. మిస్‌ యూ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌

29 Dec, 2022 10:11 IST|Sakshi

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ విషాదంలో ఉంది. తన ఇంట అనుకొని సంఘటన జరిగిందంటూ రకుల్‌ సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యింది. తనకు ఎంతో ఇష్టమైన తన పెట్‌డాగ్‌ కన్నుమూయడంతో ఇంట్లో విషాదం నెలకొందని రకుల్‌ పేర్కొంది. ఈ మేరకు రకుల్‌ తన ఇన్‌స్టాగ్రామలో తన పెంపుడు కుక్కుతో దిగిన పలు ఫొటోలను షేర్‌ చేసింది. ‘బ్లోసమ్ 16 ఏళ్ల క్రితం నువ్వు మా జీవితాల్లోకి వచ్చావు. అప్పటి నుంటి మేమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం.

చదవండి: మరో కొత్త వివాదంలో రష్మిక, సౌత్‌ ఇండస్ట్రీపై అవమానకర వ్యాఖ్యలు

మనిద్దరం కలిసే పెరిగాం. ఎలాంటి బాధ లేకుండా వెళ్లిపోయావు. రెస్ట్ ఇన్ పీస్.. ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి’అంటూ రకుల్ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్‌పై మంచు లక్ష్మి స్పందించి. బ్లోసమ్‌ మృతికి ఆమె సంతాపం తెలిపింది. “రెస్ట్ ఇన్ పీస్ బ్లోసమ్.. రకుల్ నాకు తెలిసినప్పటి నుంచి బ్లోసమ్ కూడా నాకు తెలుసు” అంటూ కామెంట్ చేసింది. అలాగే పలువురు సెలబ్రెటీలు, ఆమె ఫాలోవర్స కూడా బ్లోసమ్‌ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. 

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని వార్తలు